వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని కుటుంబ సభ్యులతో కలిసి కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు శుక్రవారం దర్శించుకున్నారు. కలియుగ ప్రత్యక్షదైవం ఆ శ్రీనివాసుని మంగళకరమైన దీవెనలు కందుకూరు నియోజకవర్గం ప్రజలందరికీ కలగాలని స్వామివారిని కోరుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.