మాజీ ఎమ్మెల్యే దివి శివరాం సోమవారం కందుకూరు పట్టణంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పనులు చేసిందన్నారు. కందుకూరు ప్రజలకు వరప్రసాదినిగా ఉన్న రాళ్లపాడు ప్రాజెక్టు ఇబ్బందులకు గురికావడానికి కారణం కేవలం వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యమేనని మండిపడ్డారు. రాళ్లపాడు సమస్యకు త్వరలోనే పరిష్కారం దొరుకుతుందన్నారు.