కందుకూరు పట్టణం లోని టి. ఆర్. ఆర్ కళాశాలల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ఆదేశానుసారం అధికారులు, పార్టీ నాయకులు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ మత్తు పదార్థములు వలన కలిగే ప్రమాదమును విద్యార్థులకు ఈ సందర్భంగా తెలియజేసారు. ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం అందించడం పట్ల విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.