మాలకొండ స్వామి జయంతి ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే

57చూసినవారు
మాలకొండ స్వామి జయంతి ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే
శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం ఆలయ పరిసరాలను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ నెల 17వ తేదీన శనివారం జరగనున్న ఈ జయంతి ఉత్సవాలకు రాష్ట్రవ్యాప్తంగా భక్తులు భారీగా హాజరయ్యే అవకాశమున్నందున, వారి కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్