భారతదేశం-పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో వీరమరణం పొందిన సత్యసాయి జిల్లాకు చెందిన జవాన్ మురళి నాయక్ మృతి చెందడం చాలా బాధాకరమని, దేశం కోసం ప్రాణాలు వదిలిన ఆ యువకుడిని దేశ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అన్నారు. అలాగే కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ, మురళి నాయక్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మురళి నాయక్ మృతి దేశానికి తీరని లోటు అన్నారు.