కందుకూరు ఆర్టీసీ బస్టాండులో బస్సులో చోరీ

65చూసినవారు
కందుకూరు ఆర్టీసీ బస్టాండులో బస్సులో చోరీ
కందుకూరులో ఇటీవల తాళాలు వేసిన ఇళ్లల్లో చోరీలు జరగడం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంటే. మరోవైపు తాజాగా బస్సులో చోరీ ఘటన వెలుగు చూసింది. కందుకూరు ఆర్టీసీ బస్టాండ్లో కనిగిరి వెళ్లే బస్సులో బోగనంపాడు వెళుతున్న మానస అనే మహిళ బ్యాగులో నల్లపూసల దండ, ఒక ముత్యాల పట్టి, కమ్మలు మొత్తం మూడున్నర సవర్ల బంగారం చోరీ జరిగింది. చోరీ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బస్ ను డిపోకు తరలించి తనిఖీలు చేశారు.

సంబంధిత పోస్ట్