ఉలవపాడు మండలంలోని అన్ ఎయిడెడ్ పాఠశాలలో ఒకటో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ఎంఈఓ రమణయ్య గురువారం తెలిపారు. పేద విద్యార్థులకు లాటరీ పద్ధతిలో 25% ఉచిత సీట్లు కేటాయించినట్లు వివరించారు. అనాధ, హెచ్ఐవి బాధితుల పిల్లలు, దివ్యాంగులు 5 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం, బలహీన వర్గాలకు 6 శాతం కేటాయించారు. ఈనెల 19 నుంచి 26 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు.