ఉలవపాడు మండలం పెదపట్టపుపాలెం పంచాయతీ పరిధిలోని పల్లెపాలెం గ్రామంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ సీతారామ స్వాములు కళ్యాణం సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజ కార్యక్రమం లో పాల్గొన్న ఎమ్మెల్యే కి వేద పండితులు ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.