అల్లూరు నగర పంచాయతీ కమిషనర్ ఉమామహేశ్వరరావు ట్రాక్టర్ యజమానులకు పలు సూచనలు చేశారు. అల్లూరు పట్టణం నుంచి చుక్కవాని దిబ్బ తారు రోడ్డుపై గేజీల చక్రాలు వేసుకొని ట్రాక్టర్లు వెళ్లడం నిషేధమని తెలిపారు. ఈ విధముగా వెళ్లడం వలన రోడ్లు పూర్తిగా ధ్వంసం అయ్యి ప్రభుత్వానికి, ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయి అన్నారు. ఈ నిబంధనలు ప్రతి ఒక్కరు పాటించాలని హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేయించారు.