నెల్లూరు జిల్లా బోగోలు పంచాయతీ చెంచులక్ష్మి పురం గిరిజన కాలనీ సమీపంలోని పొదల్లో పేకాట ఆడుతున్నారన్న సమాచారం రావడంతో ఎస్సై భోజ్యానాయక్ ఆధ్వర్యంలో శుక్రవారం దాడులు చేశారు. ఇద్దరు పరారవ్వగా. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.720 నగదును స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ తెలిపారు. పరారైన మిగిలిన ఇద్దరిని కూడా పట్టుకుని కేసు నమోదు చేస్తామని తెలిపారు.