రాజధాని మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన, అవమానించిన వారిని కఠినంగా శిక్షించాలని కావలి పట్టణ టీడీపీ మహిళా అధ్యక్షురాలు అర్షియా బేగం కోరారు. సోమవారం కావలి డిఎస్పీ శ్రీధర్ ను కలిసి సాక్షి ఛానెల్, అలాగే జర్నలిస్ట్ లపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆమె మాట్లాడుతూ సాక్షి న్యూస్ ఛానల్ వేదికగా కే. ఎస్. ఆర్ లైవ్ షో లో భాగంగా రాజధాని అమరావతి మహిళల గౌరవమర్యాదలకు భంగం వాటిల్లేలా అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు.