కావలి పట్టణ విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో 30వ తేదీ ఆదివారం సెలవు ఉన్నపటికీ కూడా వెంగళరావు నగర్ లో రెగ్యులర్ రెవిన్యూ కలెక్షన్ ఆఫీసులో (కరెంట్ ఆఫీస్) ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు కరెంట్ బిల్లులు కట్టించుకోనున్నారు. ఈ మేరకు కావలి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వై. వసంత్ రాజు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యుత్ వినియోగదారులు ఉపయోగించుకోవాలని ఆయన కోరారు.