దగదర్తి మండలం తురిమెర్ల గ్రామం మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలను కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి శనివారం సందర్శించారు. విద్యార్థులను తల్లికి వందనం అందరికీ వచ్చిందా అని అడిగారు. నాణ్యమైన భోజనం అందుతుందా లేదా అని, ఉపాధ్యాయుల బోధించే విద్య బోధన ఏ విధంగా ఉందని విద్యార్థులను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించి కావాల్సిన అభివృద్ధి చేస్తాను హామీ ఇచ్చారు.