కావలిలోని 32 పార్కులని అభివృద్ధి చేసుకుందామని, దీని కోసం దాతలు ముందుకు రావాలని ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక వివేకానంద పార్కులో వ్యాయామ పరికరాలను బుధవారం ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అందుకోసం పార్కులు అభివృద్ధి చేయాలనే ధ్యేయంగా పని చేస్తున్నట్లు వివరించారు. దాతలు ముందుకు వచ్చి పార్కుల అభివృద్ధికి సహకరించాలన్నారు.