దేవుని చల్లని చూపు కావలి నియోజకవర్గ ప్రజలపై ఉండాలని శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆయన కుమార్తె సంహిత రెడ్డి, అల్లుడు బినీత్ రెడ్డితో కలిసి కావలి పట్టణం బృందావనం కాలనీలోని వెంకటేశ్వర స్వామిని, విష్ణాలయం వీధిలోనిలోని విష్ణు మూర్తిని ఆలయాలకు విచ్చేసిన ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు.