తెలుగుదేశం శాశ్వత సభ్యత్వమును తెలుగుదేశం మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గుంటుపల్లి శ్రీదేవి చౌదరి శుక్రవారం తీసుకున్నారు. శాశ్వత సభ్యత్వం కింద చెల్లించాల్సిన రూ. లక్ష చెల్లించి సభ్యత్వాన్ని ఆమె పొందారు. అలాగే తిరివీధి ప్రసాద్ రూ. లక్ష చెల్లించి శాశ్వత సభ్యత్వం తీసుకున్నారు. సభ్యత్వ కాపీలను కావలి ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి తిరివీధి ప్రసాద్ కు, శ్రీదేవి చౌదరి భర్త గుంటుపల్లి రాజకుమార్ కి అందజేశారు.