దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న దగదర్తి-రాచర్లపాడు (డీఆర్) ఛానల్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఎన్నికల హామీ మేరకు ఇవి ప్రారంభమయ్యాయి. ఈ ఛానల్ ద్వారా సాగునీటి సమస్యలు తీరనున్నాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పనుల వేగంపై ప్రజలు ఎమ్మెల్యేకు అభినందనలు తెలుపుతున్నారు.