కావలి ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ సిఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో శనివారం తనిఖీలు నిర్వహించారు. ఇటీవల పలుచోట్ల నాటు సారా స్థావరాలపై ఎక్సైజ్ పోలీసులు దాడులు చేసి ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అనుమానిత గ్రామాలు, సమస్యాత్మక ప్రాంతాలలో భారీగా ఎక్సైజ్ ఎస్ఐలు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. నాటు సారా తయారుచేసినా, విక్రయించిన చర్యలు చాలా తీవ్రతరంగా ఉంటాయని ఈ సందర్భంగా హెచ్చరించారు.