కావలి టిడిపి కార్యాలయంలో ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు సోమవారం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే రూ, 3, 50, 59, 206 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశాం అని తెలిపారు. నమోదు చేసుకున్న నెల రోజుల్లోనే సీఎం సహాయనిధి లబ్ధిదారులకు అందిస్తున్న ఘనత టిడిపి ప్రభుత్వానిది అన్నారు. సహాయనిది పంపిణీలో రాష్ట్రంలో కావలి 2వ స్థానంలో ఉందన్నారు.