పహాల్గాం ఉగ్రదాడిలో మరణించిన కావలి పట్టణానికి చెందిన సోమిశెట్టి మధుసూదన్ రావు కు కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి నివాళులర్పించారు. మధుసూదన్ ఉత్తర క్రియల సందర్భంగా గురువారం కావలి లోని మధుసూదన్ నివాసానికి చేరుకొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ధైర్యంగా ఉండాలని వారి కుటుంబ సభ్యులకు అండగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, కావలి ప్రజలందరూ నేను ఉన్నామని హామీ ఇచ్చారు.