కావలి ఎమ్మెల్యేను కలిసిన ఎమ్మెల్సీ బీద

64చూసినవారు
కావలి ఎమ్మెల్యేను కలిసిన ఎమ్మెల్సీ బీద
నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డిని బుధవారం కావలిలోని ఆయన నివాసంలో ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంలో సహకరించినందుకు ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి, బీద రవిచంద్ర ధన్యవాదములు తెలియజేశారు. ఈ సందర్భంగా బీద రవిచంద్రని, ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి ఘనంగా సన్మానించారు. అనంతరం వారు కొంతసేపు మాట్లాడుకున్నారు.

సంబంధిత పోస్ట్