మనదేశ రక్షణ కోసం జవాన్ మురళి నాయక్ చేసిన త్యాగం అమూల్యమైనదిని, వారి ధైర్యం, స్వార్థరహిత సేవ ఎప్పటికీ మన గుండెల్లో నిలిచి ఉంటుందని, అతని బలిదానానికి మనం ఎప్పుడూ రుణపడి ఉంటామని కావలి ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి శుక్రవారం అన్నారు. ఆపరేషన్ సిందూర్ లో భాగంగా జమ్మూ కశ్మీర్ యుద్ధ భూమిలో పోరాడుతూ మన రాష్ట్రానికి చెందిన మురళి వీరమరణం పొందడం నన్ను తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు. మురళి త్యాగాన్ని రాష్ట్ర ప్రజలు మరువలేరన్నారు.