కావలి: ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని పూజలు

75చూసినవారు
కావలి: ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని పూజలు
ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని సైనికులకు మనోధైర్యం కల్పించాలని బిజెపి కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ముసునూరులోని శ్రీ ప్రసన్న అభయ ఆంజనేయ స్వామి దేవస్థానంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ భారత సైనికులు, ప్రజల క్షేమంగా ఉండాలని పూజలు నిర్వహించామన్నారు. పాకిస్తాన్ పై భారత్ ఘనవిజయం సాధించి, ఉగ్రవాదుల నెత్తుటితో భరతమాతకు వీర తిలకం దిద్దడమే ఆపరేషన్ సింధూర్ అని తెలిపారు.

సంబంధిత పోస్ట్