జమ్ముకశ్మీర్లో జరుగుతున్న యుద్ధంలో తెలుగు జవాన్ మురళీ నాయక్ వీర మరణం పొందారు. శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ నియోజకవర్గం కళ్ళి తండా గ్రామానికి చెందిన మురళీనాయక్ వీరమరణంపై కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి శుక్రవారం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశభద్రతలో తన ప్రాణాలను ఫణంగా పెట్టి వీరమరణం పొందిన మురళీనాయక్ త్యాగాన్ని మరువలేం అన్నారు. మురళీ కుటంబీకులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.