కావలి టిడిపి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి కుమార్తె సంహిత రెడ్డి గురువారం సాయంత్రం కావలి పట్టణంలోని 13వ వార్డులో ఎన్నికల ప్రచారం చేశారు. ప్రతి గడపకు తిరుగుతూ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. టిడిపి ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను స్థానిక ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు తదితరులు పాల్గొన్నారు.