తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, కావలి నియోజకవర్గం టిడిపి నేత మాలేపాటి సుబ్బానాయుడు ను బుధవారం నెల్లూరు నగరంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో దగదర్తి మండల టిడిపి నేతలు కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిశారు. మండలంలో ఎదుర్కొంటున్న పలు ప్రధాన సమస్యలను చర్చించారు. సమస్యలన్నీ త్వరగా పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు తదితరులు పాల్గొన్నారు.