కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు గురువారం ఉదయం తెల్లవారుజామున కావలి పట్టణంలోని నాలుగో వార్డు పుచ్చలపల్లి వారి వీధిలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఇంటికి తిరుగుతూ అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది శ్యామల, హైమావతి, శ్రీనివాస్, టిడిపి నేతలు కృష్ణ , సురేష్, ఉమామహేశ్వర రావు, తదితరులు పాల్గొన్నారు.