మీకోసం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ లో క్రికెట్ ట్రోఫీని గెలుపొందిన ముసునూరు వారియర్ టీమ్ సభ్యులకు కావలి ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి అభినందించారు. ట్రోఫీ, మెడల్, సర్టిఫికెట్స్ గురువారం అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకుంటూ క్రీడల్లో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించి రాష్ట్ర, దేశ ప్రతిష్టను పెంపొందించాలన్నారు.