జమ్ము కాశ్మీర్ లోని పహాల్గాం ఉగ్రదాడిలో కావలికి చెందిన సోమిశెట్టి మధుసూదన్ రావు మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఆయన కుటుంబ సభ్యులను కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ పరామర్శించనున్నారు. శుక్రవారం కావలిలో మధుసూదన్ కుటుంబ సభ్యులను కలిసి మాట్లాడతారు. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకులు ఈ విషయాన్ని తెలియజేశారు. దీంతో పోలీసులు భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు.