చెత్తపై కొత్త సమరం అంటూ కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఆదేశాలతో మున్సిపాలిటీ అధికారులు ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు. చెత్త పడవేసే ప్రాంతంలో మొక్క నాటి, ముగ్గు వేసి, ప్రార్థన చేద్దామంటూ ముందుకు సాగారు. గతంలో కావలిలోని కొన్ని ప్రాంతాల్లో చెత్తాచెదారం అద్వానంగా ఉండేది, కానీ ఇప్పుడు అదే ప్రాంతాల్లో ఒక మొక్క, ముగ్గు కనిపిస్తున్నాయి. మున్సిపల్ అధికారులను అభినందిస్తూ ఎమ్మెల్యే వారిని సన్మానించారు.