కావలి ప్రజలు గ్రామదేవతగా కొలుచుకునే శ్రీ కలుగోల శాంభవి అమ్మవారి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన ఆలయ అధికారులు, నాయకులతో కలిసి కలుగోల శాంభవి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే ఆలయ ప్రాంగాన్ని పరిశీలించి, అధికారులతో స్థానిక నాయకులతో చర్చించారు.