కొడవలూరు మండలంలోని కొత్త వంగల్లు గ్రామపంచాయతీలో గురువారం తల్లిపాల వారోత్సవాలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ పద్మావతి మాట్లాడుతూ గర్భవతులకు బాలింతలకు తల్లిపాల ఆవశ్యకతను గురించి వివరించారు. బిడ్డలకు తల్లిపాలు ఎంతో ముఖ్యమని సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంలు వాసు, రామ్మోహన్, ఐసిడిఎస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.