బుచ్చిరెడ్డిపాలెం: ఆక్వా రైతులు రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలి

60చూసినవారు
బుచ్చిరెడ్డిపాలెం: ఆక్వా రైతులు రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలి
బుచ్చిరెడ్డిపాలెం మండలం పెనుబల్లి గ్రామంలో సర్పంచ్ పెంచలయ్య ఆధ్వర్యంలో గ్రామ సభను సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్డిఓ పొట్టయ్య పాల్గొని ఆక్వా రైతులకు పలు సూచనలు చేశారు. తొలుత అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ ఆక్వా రైతులు రిజిస్ట్రేషన్లు తప్పకుండా చేయించుకుని లైసెన్స్లను పొందాలన్నారు. లైసెన్సులు తీసుకోవడం ద్వారా కరెంట్ సబ్సిడీ తో పాటు అనేక ఉపయోగాలు ఉన్నాయని చెప్పారు.

సంబంధిత పోస్ట్