చేజర్ల: ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు ఖాళీ చేయించాలి

84చూసినవారు
చేజర్ల: ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు ఖాళీ చేయించాలి
భూములు రీ సర్వే కార్యక్రమంలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములు గుర్తించి ఖాళీ చేయించాలని జెసి కార్తీక్ ఆదేశించారు. చేజర్ల మండలం నెర్నూరు జరుగుతున్న రీ సర్వే కార్యక్రమాన్ని గురువారం ఆర్డిఓ పావనితో కలిసి ఆయన తనిఖీ చేశారు. గ్రామ హద్దులు, బాటలు, కుంటలు, సామాజిక అవసరాలకు కేటాయించిన భూముల వివరాలను గ్రామాల్లో ప్రజలందరికీ తెలిసేలా చేయాలని వాటిని ఆక్రమిస్తే రెవెన్యూ యంత్రాంగం స్వాధీనం చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్