ఇందుకూరుపేట: బాల్య వివాహాలు చేయడం నేరం

62చూసినవారు
ఇందుకూరుపేట: బాల్య వివాహాలు చేయడం నేరం
ఇందుకూరుపేట మండలంలోని మైపాడులో గల అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం కిషోరీ వికాసం కార్యక్రమంలో భాగంగా కిశోర బాలికలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాల్య వివాహాలు చేయడం నేరమని బాలికలకు 18 సంవత్సరాలు, అబ్బాయిలకు 21 సంవత్సరాలు దాటిన తర్వాతే వివాహం చేయాలన్నారు. అలాగే పలు చట్టాలపై అవగాహన కల్పించారు. ఎవరైనా బాల్య వివాహాలు చేయాలని చూస్తే వెంటనే ఐసిడిఎస్ కు లేదా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్