హరే కృష్ణ మంత్ర ప్రచారమే లక్ష్యంగా నెల్లూరు ఇస్కాన్ సంస్థ చేపట్టిన 12వ జగన్నాథ రథయాత్ర విజయవంతంపై ఇస్కాన్ బృందం బుధవారం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసింది. ఈ మేరకు మంగళవారం కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిని నెల్లూరు విపిఆర్ నివాసంలో కలిసి స్వామివారి ప్రసాదాలు అందజేశారు. ఇస్కాన్ సంస్థ అభివృద్ధికి ఎంపీ వేంరెడ్డి దంపతులు ప్రతి ఏటా సహాయ సహకారాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.