కొడవలూరు ఎంపీడీవో కార్యాలయంలోని జనరేటర్ పనిచేయడం మానేసింది. కరెంట్ కోతలు విధించినప్పుడు కార్యాలయానికి వచ్చిన ప్రజలు, అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యల కోసం కార్యాలయానికి వచ్చిన వారు విద్యుత్ లేమి కారణంగా అవస్థలు పడుతున్నారు. జనరేటర్కు మరమ్మతుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.