కొడవలూరు మండలం గండవరం గ్రామంలోని శిగినం రమేష్ అనే వ్యక్తికి సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ. లక్ష చెక్కును రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాబి రామిరెడ్డి గురువారం అందజేశారు. రమేష్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా ఆ నగదు చెక్కును పట్టాభి అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాష్ట్ర ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని పట్టాభి అన్నారు.