కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డితో కొడవలూరు జడ్పీటీసీ పసుపులేటి సరోజనమ్మ కుటుంబ సమేతంగా వచ్చి గురువారం కలిశారు. జడ్పీటీసీ సరోజనమ్మతో పాటు ఆమె భర్త శ్రీనివాసులు కొడవలూరు మండలంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల గురించి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డితో చర్చించారు. ప్రస్తుతం వైసీపిలో కొనసాగుతున్న జడ్పీటీసీ సరోజనమ్మ దంపతులు తమ భవిషత్ కార్యాచరణ పై ఎమ్మెల్యేతో చర్చించారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు.