కోవూరు: పౌష్టికాహారంపై అవగాహన ర్యాలీ

82చూసినవారు
కోవూరు: పౌష్టికాహారంపై అవగాహన ర్యాలీ
కోవూరు పట్టణంలోని సత్రం వీధి అంగన్వాడీ కేంద్రంలో గురువారం పౌష్టికాహారంపై అవగాహన కార్యక్రమం, ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సూపర్ వైజర్ రాధిక మాట్లాడుతూ, గర్భవతులు, బాలింతలు తప్పనిసరిగా పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వం అంగన్వాడి కేంద్రం ద్వారా అందించే పౌష్టికాహారాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పిల్లలను అంగన్వాడి లకు తప్పకుండా పంపాలన్నారు.

సంబంధిత పోస్ట్