నెల్లూరు జిల్లాలో రేషన్ మాఫియా రెచ్చిపోతోంది. కోవూరు మండలంలోని జాతీయ రహదారి వద్ద కావలి నుంచి చెన్నైకి వెళ్తున్న రేషన్ బియ్యం లారీని సివిల్ సప్లై అధికారులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా సివిల్ సప్లై డిటి బాలకోటమ్మ మాట్లాడుతూ, లారీలో సుమారు 640 బస్తాల రేషన్ బియ్యం ఉన్నట్లు తెలిపారు. బియ్యాన్ని చెక్ చేయడానికి ల్యాబ్ పంపించామన్నారు. అవి రేషన్ బియ్యంగా నిర్ధారణ అయితే 6 ఏ కేస్ నమోదు చేస్తామన్నారు.