విడవలూరు మండలం దంపూరు లో గడ్డివామి కాలిపోయిన సంఘటనకు సంబంధించి పసల శంకరయ్య అనే రైతుకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సూచనల మేరకు టిడిపి యువ నాయకులు బెజవాడ వంశీకృష్ణారెడ్డి ఆర్ధిక సహాయం అందచేశారు. నెల్లూరు నగరం మాగుంట లే అవుట్ లోని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి నివాసంలో అడపాల శ్రీధర్ రెడ్డి, చౌకిచర్ల నీటి సంఘం అధ్యక్షులు విజయ రాఘవన్, నాయకుల సమక్షంలో పసల శంకరయ్యకు ఆర్ధిక సహాయం అందచేయడం జరిగింది.