కోవూరు నియోజకవర్గం కోవూరు మండలానికి చెందిన వైసీపీ నేత దొడ్డం రెడ్డి నిరంజన్ బాబు రెడ్డి వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియామకమయ్యారు. వైసీపీ కేంద్ర కార్యాలయ ప్రతినిధులు ఇటీవల ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. నిరంజన్ బాబు రెడ్డి ప్రధాన కార్యదర్శిగా నియామకం అవడంతో వైసీపీ నేతలు కార్యకర్తలు శనివారం అభినందనలు తెలిపారు.