శిశుమందిర్ పాఠశాలలో చిన్నారులకు అక్షరాభ్యాసం

448చూసినవారు
శిశుమందిర్ పాఠశాలలో చిన్నారులకు అక్షరాభ్యాసం
బుచ్చిరెడ్డిపాలెంలోని సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో వసంత పంచమి సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాసం కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా పాఠశాల ఆవరణంలోని సరస్వతీదేవి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చుట్టు పక్కల ప్రాంతాలకు చెందిన తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకొనివచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చిన్నారుల చేత అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పాఠశాల ఉపాధ్యాయులతో పాటు విద్యా భారతి సభ్యులు, ఆర్ఎస్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :