విడవలూరు మండలంలోని పలు ప్రాంతాల్లో గురువారం తెల్లవారుజామున ఆరు గంటల నుండి పింఛన్ల పంపిణీ కార్యక్రమం మొదలయింది. పట్టణంలోని కామాక్షి నగర్ లో అర్హులైన పెన్షన్ లబ్ధిదారులకు ప్రతి ఇంటింటికి తిరుగుతూ పింఛన్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేత సత్యం రెడ్డి, సచివాలయ సిబ్బంది, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.