బుచ్చి సబ్ స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. మరమ్మత్తుల కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు. తోటపల్లి గూడూరు మండలం పరిధిలోని ఈదూరు, పేడూరు, పాపిరెడ్డిపాలెం, వరకవిపూడి గ్రామాల్లో శనివారం ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నట్లు విద్యుత్ అధికారులు తెలిపారు.