బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో స్వచాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించనున్నారు. శనివారం ఉదయం 7: 30 గంటలకు అవగాహన ర్యాలీ నిర్వహించనున్నామని కమిషనర్ బాలకృష్ణ తెలిపారు. మున్సిపల్ చైర్ పర్సన్ మోర్ల సుప్రజా మురళి ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజలు కూడా పట్టణాన్ని స్వచ్ఛంగా ఉంచేందుకు సహకరించాలని కోరారు.