నెల్లూరు జిల్లాలో దొంగల బీభత్సం

64చూసినవారు
నెల్లూరు జిల్లాలో దొంగల బీభత్సం
ఇందుకూరుపేట మండలం మైపాడులో తాళం వేసిన ఇంట్లో 30 సవర్ల బంగారం, రూ.1.5 లక్షల నగదు దోచుకెళ్లిన ఘటన సంచలనం సృష్టించింది. కుటుంబం హైదరాబాద్‌కు వెళ్లిన సమయంలో గుర్తుతెలియని దుండగులు తలుపులు ధ్వంసం చేసి ఈ చోరీ చేశారు. స్థానికులు ఉదయం తలుపులు తెరిచి ఉండటం గమనించి యజమానికి సమాచారం అందించారు. బాధితుడు పోలీసులను ఆశ్రయించగా, డీఎస్సీ శ్రీనివాసరావు, సీఐ సుదాకర్రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్