విడవలూరు మండలంలోని రామతీర్థం శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం రాత్రి శ్రీ రామలింగేశ్వర స్వామి పులి వాహనంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ మేరకు నిర్వాహకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భక్తుల విచ్చేసి స్వామివారిని దర్శించుకోవాలని కోరారు.