వెంకటాచలం: ఆటో బోల్తా.. మహిళ పరిస్థితి విషమం

60చూసినవారు
వెంకటాచలం మండలం సర్వేపల్లి సమీపంలోని మల్లుగుంట సంఘం వద్ద శుక్రవారం ఉదయం బైక్‌ను ఆటో ఢీకొని బోల్తా పడింది. మలుపు వద్ద బైక్ ఒక్కసారిగా ఎదురుగా రాగా ఆటో బైక్‌ను ఢీకొట్టి చెట్లలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న 35 ఏళ్ల మహిళకు తీవ్రగాయాలు కాగా ఆమె పరిస్థితి విషమంగా ఉంది. మరో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి.

సంబంధిత పోస్ట్